దేశం లో అనేక ప్రాంతాల్లో మనకు కనిపించే మెట్ల బావులు మోట బావులు చెరువులు కుంటలు నేడు పాడుబడిన అవి కొద్ది దశాబ్దాల కిందట వరకు ప్రజల సాగు నీటి తాగు నీటి అవసరాల కోసం ఎంతో ఉపయోగపడ్డాయి.ఇప్పుడు బావులు వాడకం తగ్గిపోయింది.దాదాపుగా కనిపించకుండా పోతున్నాయి. కారణాలు అనేకం.
యునెస్కో అంచనా ప్రకారం ప్రపంచం లోనే అత్యధికంగా గ్రౌండ్ వాటర్ ను వాడే దేశం ఇండియా.
2007-2017 మధ్య కాలంలో దేశం లో భూగర్భ జలాలు 61% తగ్గాయని అంచనా.అందువల్ల మంచి నీటికే కాదు ఆహార భద్రత కు పెద్ద ప్రమాదం.వర్షపాతం లో 70% వరకు అనేక కారణాల వల్ల కలుషితం అయి వాడకానికి పనికిరాదు.వాటర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఇండియా కి 120ప్లేస్.
అందుబాటులో ఉన్న నీరు త్రాగటానికి పనికిరాక ప్రజలు దూరప్రాంతాల నుండి నీటిని తీసుకునే పరిస్థితి.
మెట్రో సిటీస్. సిటీస్ ,టౌన్స్ కు ఇదే పరిస్థితి.వందల మైళ్ళ దూరం నుండి నీటిని తెచ్చి ప్రజలకు అందిస్తున్నారు. వానలు వస్తే పరిస్థితి తెలిసిందే .వరద ముంపు .వానలు ఆగిన తరువాత యధాస్థితికి వస్తుంది.నీటి ఎద్దడి.నీటి కష్టాలు.దేశంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది.అందరికీ మంచినీరు దొరకని పరిస్థితి.రాష్ట్రాల మధ్య నీటి తగవులు.disputes.పరిస్థితి మరింత దిగజారే ముందే ప్రజలు ప్రభుత్వాలు మేల్కొని వాన నీటిని ఈవిధంగా గా ఒడిసిపట్టి వాడుకోవాలి అని తెలుసుకోవాలి.
నీటి వనరులు అన్నింటినీ క్లీన్ చేసి Rain water ni వాటిలో చేరేలా చూడాలి.ఇందులో ప్రజల భాగస్వామ్యం అవసరం.
మంచి నీటి నీ భవి తరాలకు అందించటానికి మనకు అందుబాటులో ఉన్న వనరులు మెట్ల బావులు బావులు చెరువులు కుంటల ను ఎలా పునరుద్ధరించాలని ,rain water harvesting ను ఎలా చెయ్యాలో water warrior గా పిలవబడే Kalpana Ramesh గారి ఇంటర్వ్యూ లో వినండి